జైపూర్‌లో కోహ్లీ దూకుడు కొనసాగేనా?

66చూసినవారు
జైపూర్‌లో కోహ్లీ దూకుడు కొనసాగేనా?
ఐపీఎల్‌లో దేశంలోని ఏ గ్రౌండ్‌లోనైనా ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడతారు. కానీ జైపూర్‌లో మాత్రం రన్స్ రాబట్టడంలో విఫలమవుతుంటారు. ఇక్కడ ఆయన గణాంకాలు ఏమంత గొప్పగా లేవు. ఇప్పటివరకు కోహ్లీ ఇక్కడ 8 మ్యాచ్‌లు ఆడి 149 రన్స్ మాత్రమే కొట్టారు. స్ట్రైక్ రేట్ 94గా ఉంది. అతడి అత్యుత్తమ స్కోరు 39. ఇక సెంచరీలు, అర్థసెంచరీలు లేనే లేవు. ముఖ్యంగా సందీప్ శర్మ బౌలింగ్‌లో కోహ్లీ తడబడుతూ ఉంటారు.

సంబంధిత పోస్ట్