నెల్లూరు జిల్లా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా చంద్రబాబుపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. "అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు నాయుడు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే. పెత్తందార్ల పక్షాన బాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడు. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది." అని సీఎం పేర్కొన్నారు.