ఇప్పటికైనా మోడీ మణిపూర్ సందర్శిస్తారా?: ఉద్ధవ్

57చూసినవారు
ఇప్పటికైనా మోడీ మణిపూర్ సందర్శిస్తారా?: ఉద్ధవ్
ప్రధాని మోడీ ఇప్పటికైనా మణిపూర్ సందర్శిస్తారా అని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించారు. బుధవారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై RSS చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. మోహన్ భగవత్ వ్యాఖ్యల తర్వాత అయినా మణిపూర్‌ను మోడీ సందర్శించాలన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కూడా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు.

ట్యాగ్స్ :