న్యూయార్క్ స్టేడియం కూల్చివేస్తారా?

58చూసినవారు
న్యూయార్క్ స్టేడియం కూల్చివేస్తారా?
న్యూయార్క్‌లో భారత్‌-అమెరికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ నాసావు స్టేడియంకు చివరి మ్యాచ్‌గా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత స్టేడియంను కూల్చివేయనున్నట్లు సమాచారం. అయితే ఈ స్టేడియంను టీ20 ప్రపంచకప్ కోసం నిర్మించారు. రూ.240 కోట్లతో మూడు నెలల్లోనే దీని నిర్మాణం పూర్తయింది. ఈ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌లను ఏర్పాటు చేశారు. టోర్నీలో ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌లన్నీ అత్యల్ప స్కోరుతో ముగిశాయి.