తమిళనాడులోని తంజావూరులో ఐదేళ్ల బాలుడిపై 50 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది. బాలుడు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. అదే పాఠశాలలో ఆ మహిళ స్కూల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తోంది. తొలుత బాలుడిని ఆమె దూషించింది. తర్వాత మరుగుదొడ్డికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడింది. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలుడిని బెదిరించింది. నిందితురాలిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.