కదులుతున్న రైలు మెట్లపై మహిళల ప్రయాణం (వీడియో)

85చూసినవారు
రైలు ప్రయాణమంటేనే ఈ రోజుల్లో పెద్ద సాహసంగా మారిపోయింది. రిజర్వేషన్ బోగీల్లో సైతం కిక్కిరిసి ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జనరల్ బోగీలైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే క్రమంలో రైలు ఎక్కేందుకు మహిళలు పడుతున్న అవస్థలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైలులో ఖాళీ లేకపోవడంతో మహిళలు రైలు డోర్ మెట్లపైనే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. భారత రైల్వే తీరు ఇలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :