ఏపీకి తుఫాను ముప్పు..!

548చూసినవారు
ఏపీకి తుఫాను ముప్పు..!
ఏపీలో ఈరోజు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఈనెల 22 వరకు మరింత బలపడి.. 24 వరకు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు భారీ.. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్