ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయాన్ని విజయవాడలోని రూ.50 కోట్లకు పైగా విలువ చేసే నగరపాలక సంస్థ స్థలంలో కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మాణం చేపట్టారు. ఏలూరు రైల్వే స్టేషన్ కు కొద్దిదూరంలో ఉన్న ఒక క్రీడాప్రాధికార సంస్థకు చెందిన స్థలం వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు అనే గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 1.50 ఎకరాలలో వైసీపీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు.