కర్ణాటకలోని బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ 20 ఏళ్ల యువతి తన సొంత ఇంట్లోని బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. యువతి స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళింది. అక్క రావడానికి లేట్ అవ్వడంతో యువతి తమ్ముడు బాత్రూం డోర్ను పగలగొట్టి చూడగా రక్తపుమడుగులో పడి ఉంది. అక్కను చూసిన తమ్ముడు షాక్ కి గురయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్య? హత్య..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.