శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గుర్రం సాయిరాం (21) అనే యూట్యూబర్ ఆదివారం తన ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిరాం లఘు చిత్రాలకు మాటలు రాయడం, పాటలకు ట్యూన్స్ కట్టడం, పాటలు పాడడం చేసేవాడు. తను పాడిన ‘యాది కొస్త లేడా ఈ పేదోడు నీకు’ అనే పాట విశేష ప్రజాదరణ పొందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.