రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కమలాపురం మండలం పందిళ్ళ పల్లె గ్రామ సమీపాన కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలంలో కడప కు చెందిన షేక్ అబ్దుల్ హసన్ (23) అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 లో కడప రిమ్స్ కు తరలించారు. చిలమకూరకు చెందిన కారు కడపకు చెందిన ఆటోగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్