వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ

కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పులివెందుల మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అత్యాధునిక మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. మంత్రి ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

సంబంధిత పోస్ట్