కార్మికుల సమిష్టి పోరాటంతో సమస్య పరిష్కారం

కార్మికుల సమిష్టి పోరాటంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి విశాఖ ఉక్కు కార్మికుల సమస్యను పరిష్కరించినట్లు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లి లోఆయన మాట్లాడుతూ 48 గంటల్లో తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోక పోతే నిరాహారదీక్ష చేస్తానని మా అధినేత షర్మిల ప్రకటించడంతో ఉద్యోగాల నుంచి తొలగించబడిన 4, 290 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి తీసుకున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్