పులివెందులలో వైసీపీ నాయకుల పూజలు

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పులివెందుల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం వైసీపీ నాయకులు వెంకటేశ్వర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక వైఎస్ రాజారెడ్డి భవన సమీపంలోని పాత ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద నుంచి వైసీపీ నాయకులు భజన చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్