మొగిలి ఘాట్ రోడ్డులో వేగ నియంత్రణకు చర్యలు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో అధికారులు వేగ నియంత్రణకు చర్యలు చేపట్టారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో కలెక్టర్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డీఓ, డీటీఓ, ఆర్&బి ఈఈ, డీఈఈ, ఎన్హెచ్, పోలీస్ అధికారులు ఘాట్ రోడ్డును ఆదివారం పరిశీలించారు. 5 బ్లాక్ స్పాట్లను గుర్తించి వేగ నియంత్రణ చర్యలకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్