నేడు, రేపు తీవ్ర ఎండలు

సోమ, మంగళవారాల్లో రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నంద్యాల, కడప, మన్యం జిల్లాల్లోని 37 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్