టీ20 క్రికెట్లో ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించాడు. దీనితో కలిపి ఇప్పటి వరకు 110 అర్ధశతకాలు సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ డిస్ట్రాయర్ క్రిస్ గేల్ (110) రికార్డును సమం చేశాడు. ఐపీఎల్లో వార్నర్ 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని ఖాతాలో 4 సెంచరీలు కూడా ఉన్నాయి.