ఫిబ్రవరి మొదలు కాగానే ఎండలు భయపెట్టేస్తున్నాయి. అప్పుడే ఎండలు మండిపోతున్నాయని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆరోగ్య పరంగా సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలతో సతమతమవ్వాల్సిందే. అందుకే పలు రకాల ఆహారాలు తినాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి బొండాలను రోజు తాగాలట. అంతేకాకుండా పెరుగు కూడా డైట్లో భాగం చేసుకోవాలని అంటున్నారు. వేడి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.