మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ ఊరేగింపు తర్వాత ఉప్పు నరేందర్, స్వామి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘర్షణలో నరేందర్ ఆగ్రహంతో తన థార్ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బృందంపైకి ఎక్కించాడు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి మృతి చెందగా.. ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.