ఎన్నికల ప్రక్రియపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. జగన్ పెట్టిన పోస్టుకు తెలుగుదేశం పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని సూచించారు.