ఢిల్లీలోని మహిళా సామాజిక వాలంటీర్లు, మహిళలు మానవత్వం చాటుకున్నారు. జంతువుల పట్ల ప్రేమ చూపించారు. చిరాంగ్ ఎన్క్లేవ్లోని ఓ ఇంటి బయట కుక్క పిల్లలను కారులో బంధించారు. అయితే ఆకలితో అరవడంతో స్థానికులు గమనించి, ధైర్యం చేసి కారు అద్దాలు పగలగొట్టి కుక్క పిల్లలను రక్షించారు. ప్రస్తుతం, ఆ మహిళలు చేసిన మంచి పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.