గర్భిణీ స్త్రీని మూడు కి.మీ మోసుకెళ్లిన 108 సిబ్బంది

82చూసినవారు
ఏపీలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. అడ్డతీగల మండలం డి.చోడవరం గ్రామానికి చెందిన వంతల జశ్వితకు నెలలు నిండడంతో ముందస్తుగా ఆసుపత్రికి తరలించాలని 108 సిబ్బందికి కాల్ చేశారు. 108 వాహనం డి పోలవరం వరకు వెళ్లగా.. అక్కడి నుండి వాహనం వెళ్లడానికి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది మూడు కి.మీ కాలినడకన వెళ్లి గర్భిణీని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. డోలీ కట్టి 108 సిబ్బంది టిఎన్టి అశోక్, పైలట్ ఎస్ కె వి.నవాజ్‌లు, గ్రామస్తులు పీహెచ్ఓ రత్నం సహాయంతో భుజాలపై మోసుకుంటూ 108 అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చి అక్కడ నుండి అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్