ఎద్దులకు సమాధులు నిర్మించి, విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్న రైతు కుటుంబం

66చూసినవారు
ఎద్దులకు సమాధులు నిర్మించి, విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్న రైతు కుటుంబం
ఓ రైతు కుటుంబం తమ ఎద్దుల జ్ఞాపకార్థం ఏటా అన్నదానం చేస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురానికి చెందిన రైతు పెద్దప్పయ్యకు ఉన్న కాడెడ్లు 15 ఏళ్ల కిందట చనిపోయాయి. అప్పట్లో వాటికి అంత్యక్రియలు చేసి, గ్రామ పొలిమేరలో ఆలయం కట్టి అందులో ఆ రెండు ఎడ్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. పెద్దప్పయ్య మరణాంతరమూ కుటుంబ సభ్యులు చిన్న వెంకటప్ప, మునిరాజ వాటిని పూజిస్తున్నారు.

సంబంధిత పోస్ట్