ఆస్పత్రి గదిలో బందీ అయిన 5ఏళ్ల బాలుడు

556చూసినవారు
ఆస్పత్రి గదిలో బందీ అయిన 5ఏళ్ల బాలుడు
ఐదేళ్ల బాలుడు ఆసుపత్రి గదిలో రోజంతా బందీ అయిన ఘటన కర్నూలు జిజిహెచ్ లో జరిగింది. ఉస్సేనయ్య, మౌనికల కుమారుడు సుజిత్‌(5)కు పుట్టుకతో మూగ, చెవుడు. ఆదివారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న ఎనస్థీషియా విభాగాధిపతి గదిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది ఆ గదిని శుభ్రం చేసి తాళం వేసుకుని వెళ్లిపోయారు. బాలుడు కనిపించక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోమవారం తలుపులు తెరవగా సుజిత్ కనిపించాడు.

సంబంధిత పోస్ట్