యువకుడి దారుణ హత్య

63చూసినవారు
యువకుడి దారుణ హత్య
గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు బుర్రిపాలెం వాసి పేరిశెట్టి కోటేశ్వరరావు (34)గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్