పింఛన్ తీసుకునే వారికి ALERT

74చూసినవారు
పింఛన్ తీసుకునే వారికి ALERT
ఏపీలో మంగళవారం పింఛన్ల పంపిణీ జరిగింది. నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పింఛన్లు అందజేశారు. అయితే ఇవాళ పబ్లిక్ హాలిడే కావడంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. 1వ తేదీన పబ్లిక్ హాలిడే/ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న పబ్లిక్ హాలిడే/ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పింఛన్ అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇంకా పింఛన్లు తీసుకోని వారికి గురువారం అందజేయనున్నారు. ఇప్పటివరకు 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పింఛన్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్