AP: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుని మండలం తేటగుంట వద్ద యాసిడ్ ట్యాంకర్ను గ్యాస్ సిలిండర్లతో వెళ్తోన్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో యాసిడ్ లీకై.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దుర్వాసనతో కూడిన దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.