అనకాపల్లిలో వ్యక్తి దారుణ హత్య

57చూసినవారు
అనకాపల్లిలో వ్యక్తి దారుణ హత్య
అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. బుచ్చయ్యపేటలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. తాటికొండ అచ్చెయ్యనాయుడు (41) అనే వ్యక్తిని గనిరెడ్డి శ్రీను కత్తితో నరికి చంపాడు. నిన్న రాత్రి వీరద్దరూ తాగి గొడవ పడ్డారని, గొడవ వల్లే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు గనిరెడ్డి శ్రీను బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.