ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వేట కొడవళ్ళతో నరికి టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ నేతలు నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.