నిద్రిస్తున్న వ్యక్తిపై యాసిడ్ దాడి

60చూసినవారు
నిద్రిస్తున్న వ్యక్తిపై యాసిడ్ దాడి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్