ఏపీలో దున్నని భూమి అంతా జగన్ దే: పవన్

76చూసినవారు
ఏపీలో దున్నని భూమి అంతా జగన్ దే: పవన్
ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'ఏపీలో గజం స్థలం ఉన్నవాళ్లయినా సరే... సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగన్ దే అయిపోతుంది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీవి, జగన్ వి అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలను కూడా తాకట్టు పెట్టేస్తాడు. వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలబెట్టినట్టే.' అని అన్నారు.