పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

60చూసినవారు
పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్
సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం పింఛన్లను పంపిణీ చేశారు. ఆమె ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల కష్టసుఖాలను తెలుసుకుని పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయంత్రంలోగా మొత్తం పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందన్నారు.