నాతవరం మండలం పెద్ద జగ్గంపేటలో గురువారం టీడీపీ ఏర్పాటు చేసిన శంఖారావం కార్యక్రమానికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి మాజీ మంత్రి అయ్యన్న కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. వైసీపీ నిరంకుశ పాలన చూసి వైసీపీ కార్యకర్తలు సైతం పార్టీని వీడుతున్నారన్నారు.