అనంతపురం జనసంద్రంగా మారింది. సోమవారం అనంత వెంకటరామిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కోర్టు రోడ్డు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగి ర్యాలీ కొనసాగింది. అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఒక నామినేషన్ను అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, మరో నామినేషన్ను వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి ప్రతిపాదించారు.