గుండెపోటుతో AIG ప్రతిభా త్రిపాఠి మృతి

64చూసినవారు
గుండెపోటుతో AIG ప్రతిభా త్రిపాఠి మృతి
మధ్యప్రదేశ్‌లో మహిళా పోలీసు ఉన్నత అధికారి చనిపోయారు. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (AIG) ప్రతిభా త్రిపాఠి సోమవారం ఇండోర్ నుంచి భోపాల్‌కు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమెను భర్త శిశిర్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మృతిని భోపాల్‌ పోలీస్ కమిషనర్ హరినారాయణాచారి మిశ్రా ధృవీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్