గుంతకల్లు మున్సిపాలిటీలోని మార్కెట్ యార్డులో చేస్తున్న శానిటేషన్ పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్య పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనంతరం వార్డు సమస్యల గురించి ప్రజలకు ఆరా తీశారు.