నియోజకవర్గ అభివృద్ధి మెట్టు గోవిందరెడ్డి తోనే సాధ్యం

1050చూసినవారు
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తరఫున సతీమణి మెట్టు యశోదమ్మ శనివారం 23వ వార్డులో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డు ఇంచార్జ్ వంశీ ఆధ్వర్యంలో ప్రతి గడపను సందర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లను ఫాన్ గుర్తుపై వేసి విజయాన్ని అందించాలని కోరారు. సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే చేరాలంటే మరో మారు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆశీర్వదించాలన్నారు.