కింగ్ ఛార్ల్స్ చిత్రపటంపై విమర్శలు

83చూసినవారు
కింగ్ ఛార్ల్స్ చిత్రపటంపై విమర్శలు
బ్రిటన్ రాజు ఛార్ల్స్‌‌కు చెందిన తాజా చిత్రపటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరడుగుల ఎత్తున్న చిత్రపటాన్ని జొనాధన్ అనే ఆర్టిస్ట్ 3ఏళ్ల పాటు కష్టపడి రూపొందించారు. దీన్ని బ్రిటన్ రాజకుటుంబం నెట్టింట పంచుకోగా స్పందన పూర్తి నెగిటివ్‌గా వచ్చింది. పూర్తి ఎరుపు, ఊదా రంగులతో గీసిన ఆ చిత్రపటం ఏమాత్రం ఆకర్షణీయంగా లేదంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఛార్ల్స్ గత ఏడాది రాజుగా పట్టాభిషిక్తులైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్