Mar 05, 2025, 11:03 IST/
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్ల హవా
Mar 05, 2025, 11:03 IST
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని 4వ స్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి ఐదో ర్యాంక్కు పడిపోయాడు. శుభ్మన్ గిల్ మాత్రం నంబర్ వన్ ర్యాంక్లోనే కొనసాగుతున్నాడు. పాక్ ప్లేయర్ బాబర్ ఆజామ్ రెండో ర్యాంకులో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు భారత ప్లేయర్లు ఉండటం విశేషం.