AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో మొత్తం అబద్ధాలు చెప్పించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 9 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని మరిచిపోయారు.’ అని ఆరోపించారు.