చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన యువత

52చూసినవారు
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డీఎస్సీ మీద చేయడంపై యువత ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నెరవేర్చినందుకు గురువారం కళ్యాణదుర్గం పట్టణంలోని యువత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే సురేంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పవన్, రాజేష్ బాబు, ప్రకాష్, వాల్మీకి రాజు, విజయ్, ప్రణీత్, మహేష్, మణి, ఆనంద్, రమేష్, ఎర్రిస్వామి పాల్గొన్నారు.