శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ అకాడమీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాసిన్లోని క్యాంటీన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కాగా, ఇటీవలే ప్రధాని మోడీ నాసిన్ అకాడమీని ప్రారంభించారు. అగ్నిప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు.