ఢిల్లీలోని ఐఎన్ఏ మెట్రో స్టేషన్లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఉదయం 7.38 గంటల సమయంలో ఓ వ్యక్తి కదులుతున్న రైలు ముందు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లాట్ఫారమ్పైకి ఆ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇతర ప్రయాణికులు చూస్తుండగానే మెట్రో రైలు ముందుకు దూకి చనిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.