చికెన్ ఇవ్వలేదన్న కోపంతోనే యేసు రాజు హత్య చేశాడు

3600చూసినవారు
చికెన్ ఇవ్వలేదన్న కోపంతోనే యేసు రాజు హత్య చేశాడు
రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం మురిడి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన దారుణ హత్య ఘటనను డీఎస్పీ శ్రీనివాసులు స్థానిక సీఐతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల మేరకు దేవస్థానంలో పదేళ్లుగా స్వీపర్ గా పనిచేస్తున్న 55 ఏళ్ల మురిడప్ప చికెన్ తీసుకుని వండుకొని తింటుండగా అక్కడికి వచ్చిన యేసు రాజు అనే వ్యక్తి చికెన్ ఇవ్వమని అడిగాడు. మురిడప్ప ఇవ్వకపోవడంతో యేసు రాజు రాయితో బలంగా కొట్టాడు. దీంతో మురిడప్ప అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు డిఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :