2 వేల మంది పోలీసులతో బందోబస్తు

8265చూసినవారు
సీఎం వైఎస్ జగన్ పర్యటనకు 2 వేల మంది పోలీసులతో తాడిపత్రి లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నానికే పోలీసు బలగాలు తాడి పత్రికి చేరుకున్నాయి. పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జిల్లా ఎస్పీతో పాటు ఇద్దరు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలతో పాటు 2000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు.