రాళ్లదాడి కేసులో వైకాపా నాయకుడి అరెస్టు

3257చూసినవారు
రాళ్లదాడి కేసులో వైకాపా నాయకుడి అరెస్టు
ఎన్నికల సందర్భంగా తాడిపత్రి పట్టణంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య పరస్పర రాళ్ల దాడులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి తాడిపత్రి మండల వైకాపా నాయకుడు రామేశ్వరరెడ్డి ని శనివారం పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్సై గౌస్ భాష తెలిపారు. రాళ్ల దాడి జరిగిన తరువాత రోజు నుంచి ఇరుపార్టీ నాయకులు పరారీలో ఉన్నారని రామేశ్వరెడ్డి ఉన్న చోటు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై వివరించారు.

సంబంధిత పోస్ట్