ఇజ్రాయెల్ దాడిలో 210 మంది మృతి!

58చూసినవారు
ఇజ్రాయెల్ దాడిలో 210 మంది మృతి!
ప్రపంచ దేశాలు, ఐరాస వారిస్తున్నా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం సెంట్రల్ గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 210 మంది మరణించారు. ఈ దాడిలో హమాస్ చెరలో బందీగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులను రక్షించినట్టు అధికారులు తెలిపారు. నుసిరత్ శిబిరంపై జరిపిన దాడిలో 210 మంది మరణించగా, 400 మంది గాయపడ్డారని హమాస్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్