కూడేరు మండలం ముద్దలాపురం వద్ద బుధవారం రాత్రి జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఆత్మకూరు మండలం తలుపూరుకు చెందిన యువకులు మహేశ్, రాము తమ గ్రామం దిశగా వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం జాతీయ రహదారి అత్యవసర వాహనంలో అనంతపురం తరలించారు.