
ఉరవకొండ: తల్లిదండ్రులకు మొర పెట్టుకున్న స్కూల్ హెచ్ఎం
విద్యార్థుల అల్లరి భరించలేక పోతున్నామంటూ ఓ స్కూల్ హెచ్ఎం విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖ రాసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉరవకొండ మండలం అమిద్యాల జడ్పీహైస్కూల్ కు చెందిన కొంతమంది విద్యార్థులు స్వీచ్ బోర్డులు పగలగొట్టి, బెంచీలు విరిచినట్లు ఆ లేఖలో వివరించారు. స్కూల్ ప్రహరీని ధ్వంసం చేశారని వారి అల్లరి ఎక్కువైందంటూ, వారిని దారిలో పెట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు