వజ్రకరూర్ మండలంలో మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
వజ్రకరూర్ మండలం జరుట్ల రాంపురం గ్రామంలో శుక్రవారం ఉరవకొండ కాంగ్రెస్ అభ్యర్ధి వై. మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి నియోజకవర్గంలో తనను గెలిపించాలని కోరారు.