కేశాలు దానం చేసిన మదనపల్లె మహిళ

67చూసినవారు
క్యాన్సర్ బాధితుల సహాయార్థం మదనపల్లెకు చెందిన విజయలక్ష్మి తన కేశాలను దానం చేశారు. ఆదివారం మదనపల్లె పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ ఆఫీసుకు వెళ్లి తన కేశాలను సంస్థ సభ్యులకు అందజేశారు. విజయలక్ష్మి దాతృత్వాన్ని అభినందిస్తూ ఆమెకు ప్రశంసాపత్రం, పూలమొక్క బహూకరించారు. క్యాన్సర్ బాధితుల కోసం ఇప్పటి వరకు 50మంది తమ కేశాలను దానం చేసినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్